జాతీయ ఆహార భద్రతా చట్టం: రేషన్ కార్డు లబ్దిదారుల ఈకేవైసీ ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశం.. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద రేషన్ కార్డు లబ్దిదారుల ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను 2025 ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు గతంలోనే రేషన్ కార్డు లబ్దిదారుల ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, తాజాగా ఈ గడువును స్పష్టం చేస్తూ అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసింది.


ఈకేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయడం ద్వారా లబ్దిదారుల గుర్తింపును నిర్ధారించుకోవడం, పథకం అమలులో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, 2025 ఏప్రిల్ 30వ తేదీ తర్వాత కూడా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే, రాష్ట్రాలకు ఇచ్చే సబ్సిడీ నిలిచిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది.


అంతేకాక, ఆహార ధాన్యాల కేటాయింపుపై కూడా ఈ వైఫల్యం ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు తమ లబ్దిదారుల ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని, గడువులోపు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: