
కేటీఆర్ మాట్లాడుతూ, 400 ఎకరాల హెచ్సీయూ భూములను అమ్మి రూ.30 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. "ఫ్యూచర్ సిటీలో 50 వేల ఎకరాలు సిద్ధం చేస్తుంటే ఈ 400 ఎకరాలు ఎందుకు అవసరం?" అని నిలదీశారు. హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే భూములను చదును చేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం ఈ భూముల స్వాధీనాన్ని ఖండిస్తోందని, ఈ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.