
కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసల చొప్పున పెంపు జరిగింది. ఈ వాహనాల ఛార్జీ ఇప్పటి వరకు కి.మీ.కు రూ.2.34గా ఉండగా, ఇకపై రూ.2.44గా వసూలు చేయనున్నారు. అలాగే, మినీబస్, లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్సీవీ)లకు కిలోమీటర్కు 20 పైసలు పెంచారు. ఈ వాహనాల టోల్ రేటు రూ.3.77 నుంచి రూ.3.94కు పెరిగింది. రెండు యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు రూ.6.69గా ఉన్న ఛార్జీ ఇక నుంచి రూ.7గా ఉంటుంది.
భారీ వాహనాలపై మరింత ఎక్కువ భారం పడనుంది. ఈ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారీ వాహనాల టోల్ ఛార్జీ రూ.15.09 నుంచి రూ.15.79కు చేరింది. ఈ పెంపు వాహనదారులకు అదనపు ఆర్థిక భారం కానుందని, అయితే రోడ్డు నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసం ఈ నిర్ణయం అవసరమని ఐఆర్బీ ఇన్ఫ్రా అధికారులు తెలిపారు. ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో, ఓఆర్ఆర్పై ప్రయాణించే వారు తమ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.