తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చినట్లు గుర్తు చేసిన లోకేష్‌, అన్ని రంగాల్లో తెలుగువాళ్లు నెంబర్‌వన్‌గా నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొన్నామని విమర్శించారు. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలని, మిత్రపక్షాలతో సామరస్యం నిలబెట్టుకోవడం మన బాధ్యత అని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తు చేస్తూ, కార్యకర్తలు సొంతకాళ్లపై నిలబడాలని, వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు హెరిటేజ్‌ అనే విత్తనం నాటారని, అయితే తమ ఖర్చుల కోసం రాజకీయాలపై ఆధారపడే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.


కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన లోకేష్‌, ప్రమాద బీమాను మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, కొందరు కార్యకర్తలు చిన్న విషయాలకు అలిగి, మనస్పర్థలతో దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అలకలకు వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సూచించారు. చిన్న కుటుంబంలోనే గొడవలు ఉంటే, ఇంత పెద్ద పార్టీలో ఉండకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఇన్‌ఛార్జ్‌ మంత్రులను సంప్రదించాలని, గ్రామస్థాయి సమస్యలను తహశీల్దార్‌, వీఆర్‌వోలు చూడాలని ఆదేశించారు. గ్రామాల నుంచి చిన్న సమస్యలను తన వద్దకు తీసుకొస్తున్నారని, ఇది స్థానికంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.




మరింత సమాచారం తెలుసుకోండి: