
ఇక బంగారం రేటు ప్రతి షాపులో కూడా ఒకే విధంగా ఒకే రేటులో ఉంటాయి. కేవలం తయారీ విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. అది కూడా పెద్ద తేడాలో ఉండకూడదు. కానీ వజ్ర వ్యాపారంలో తేడాలు బీభత్సంగా ఉంటాయి. వజ్రాల యొక్క రంగు రాళ్ళ తదితర అంశాలను బట్టి వజ్రాలు రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే రష్యా ను ఈ విధంగా కూడా దెబ్బతీయాలని యూరోపియన్ దేశాలు జి సెవన్ దేశాలు భావిస్తున్నాయి.
భారత్ లో డైమండ్ ల వ్యాపారానికి గుజరాత్ లోని ప్రధాన పట్టణాలు ఫేమ్. రష్యా నుంచి ఇండియాకు ముడిసరకు వస్తుంది. దాని నుంచి ఇక్కడ విలువైన వజ్రాలను తయారు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఈ వ్యాపారం ఇపుడు దెబ్బ తినేలా ఉంది. సూరత్ లాంటి నగరాల్లో ప్రముఖంగా వజ్రాల వ్యాపారం చేస్తుంటారు భారతదేశంలో ఎక్కడ లేని వ్యాపారం ఈ పట్టణంలో కొనసాగుతుంది కానీ యూరప్ దేశాలు నాటో దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో వజ్ర వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు రాబోయే రోజుల్లో వజ్రాల వ్యాపారానికి ఏ విధమైన ప్రతికూలతలు ఏర్పడతాయని ఆలోచిస్తున్నారు. మరి ఈ వ్యాపారుల భవిష్యత్ ఏమవుతుందో చూడాలి.