ఏంటి సమాజం... రోజురోజుకు ఎటు పోతుంది మనుషుల తీరు... మహిళను  దేవతగా పూజించే రోజుల నుంచి... ఆడ పిల్లను చూస్తే కామంతో ఊగిపోయే రోజుల్లో కి వచ్చారు. మనకు జన్మనిచ్చింది  కూడా ఒక మహిళమూర్తి  అని మరిచిపోయి మరో మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. సమాజంలో రోజురోజుకూ విలువలు మంట కలిసిపోతున్నాయి.  బాధ్యతగా వ్యవహరించాల్సిన వారే  దారుణాలకు పాల్పడుతున్నారు. రోడ్డు  మీద వెళ్తే ఆకతాయిలు... ఇంట్లో  ఉంటే సొంత వాళ్ళ నుండి.. అన్ని  అవాంతరాలను దాటుకుని అతి కష్టం మీద చదువుకోవడానికి వెళ్లి  ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకుంటే... అక్కడ గురువులు నుండి.. ప్రతి చోట ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి.



ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా... దారుణంగా శిక్షించిన ఎక్కడ సమాజంలో మార్పు మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు అభం శుభం తెలియని ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. తమ దగ్గర చదువుతున్న ఆడ పిల్లలని తమ సొంత బిడ్డల్లా  చూసుకొని.. విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకు రావాల్సింది  పోయి... ఎంతో గౌరవం గల ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చే విధంగా కొంతమంది ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు నేటి రోజుల్లో. తమ  దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల పైనే దారుణాలకు పాల్పడుతున్నారు.


ఇటీవలే రాజస్థాన్ లో  సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆల్వార్  జిల్లాలోని నారాయణ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో చదువుతుంది బాలిక. ఆ బాలికపై పాఠశాల మేనేజర్ తో  పాటు ఉపాధ్యాయులు ఇతరులు కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక దీనిపై బాలిక పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేయడంతో... 13 మంది సిబ్బంది పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం.. దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఈ అత్యాచారానికి మరో మహిళా టీచర్ కూడా సహకరించిందట.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: