ఇటీవల ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆహారం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత భార్య ఆత్మహత్య చేసుకుంది అని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కాని చివరికి పోలీసుల ఎంట్రీ తో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హర్యానా లో చోటు చేసుకుంది. గుర్గావ్ ప్రాంతంలోని సూర్య విహార్ కాలనీకి చెందిన దీపక్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. అయితే ఇటీవలే ఆహారం వడ్డింపు విషయంలో భార్య తో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయాడు. విచక్షణ కోల్పోయాడు. ఇక తన భార్యను దారుణంగా హత్య చేశాడు..
ఇక ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది పని నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తన భార్య ఆత్మహత్య చేసుకుంది అంటూ పోలీసులకు సమాచారం కూడా అందించాడు. ఈ క్రమంలోనే రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది ఆత్మహత్య కాదు హత్య అనే విషయం తేలింది. ఈ క్రమంలోనే తమదైన శైలిలో విచారణ చేపట్టగా ఇక భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు సదరు వ్యక్తి. మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆహార విషయంలో గొడవ జరగడంతో హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.