
అది సరేగాని గురు.. ఇప్పుడు ఈ కప్పలో పంచాయతీ ఎందుకు అని అనుకుంటున్నారు కదా.. కప్ప గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అని భావిస్తున్నారు కదా.. ఇందుకు కారణం ఏంటో తెలుసా.. కనీసం చేత్తో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని కప్పతో.. ఇక్కడ ఒక వ్యక్తి సాంబార్ చేశాడు. ఇది వినడానికే యాక్ అనిపించేలాగే ఉంది కదా. కేవలం సాంబార్ చేయడమే కాదు ఇంటిల్లిపాదికి ఆ కప్పతో చేసిన సాంబార్ వడ్డించాడు. పాపం వాళ్లకు తెలియదు కదా అది పప్పు సాంబార్ కాదు కప్ప సాంబార్ అని.
దీంతో సాంబార్ ఏదో కొత్తగా టెస్ట్ ఉంది అని ఒక ముద్ద ఎక్కువే తిన్నారు. కానీ ఆ తర్వాతే అసలు తంటాలు మొదలయ్యాయి. ఈ ఘటన ఒడిస్సా లోని కియాం జోర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కప్పను చంపి దానితో సాంబార్ చేసిన వ్యక్తి దాన్ని ఇద్దరు పిల్లలు సహా కుటుంబ సభ్యులందరికీ అన్నంలో వడ్డించాడు. దీంతో అది తిన్న కుటుంబ సభ్యులు వాంతులు చేసుకొని స్పృహ తప్పి పడిపోయారు. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే వారికి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయింది. ఇక మరో నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.