అయితే ఒకసారి ఆ పాపపై జరుగుతున్న దారుణాన్నీ తన తల్లి కళ్లారా చూడడంతో షాక్ కి గురయి ఆమె సదరు ప్రాంతంలోని శిశు సంక్షేమ శాఖకు సమాచారం అందించడంతో ఆ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మొత్తంగా ఆ కేసు గురించి 18 మంది సాక్షులను విచారించిన దేవి కులం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిందితులకు గరిష్టంగా 84 ఏళ్ల పాటు శిక్ష విధించింది.
అయితే తండ్రితో పాటు మేన మామ కూడా అదే శిక్ష విధించిన కోర్టు ఐపిసి మరియు జువైనల్ జస్టిస్ ఆక్ట్ ప్రకారం ఈ శిక్ష ఒకేసారి అనుభవించాలని ఆదేశించడంతో గరిష్టంగా 20 ఏళ్ల పాటు నిందితులు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. ఈ శిక్షతోపాటు నిందితులు చెరొక మూడు లక్షలు నష్టపరిహారం కూడా చెల్లించాలని, ఆ డబ్బుని బాధితురాలికి అందించాలని సైతం ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు దేవీకులం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సైతం కొంత పరిహారం అందించాలని ఆదేశాలను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వెల్లడించింది.