సరిహద్దుల వద్ద సైనికులు శత్రు దేశాల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పహారా కాస్తూ ఉంటే.. దేశం నడిబొట్టులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులు నిరంతరమ్ పనిచేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా హాయిగా నిద్రపోగలుగుతున్నారు అంటే దానికి ఇక శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులే కారణమని చెప్పాలి. ఏదైనా నేరం చేస్తే ఇక చట్టాల ప్రకారం పోలీసులు శిక్షిస్తారు అన్న భయం చాలామందిలో ఉంటుంది. అందుకే ఇక నేరాలు చేయడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు.


 అటు పోలీసులన్నా ప్రజల్లో ఉండే రెస్పెక్ట్ మరో లెవెల్ లో ఉంటుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా పోలీసులు నేరస్తులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఇలా జైల్లో పెట్టి ఇక ఆ తర్వాత ఆధారాలను సాధించిన తర్వాత.. ఆ నిందితులను కోర్టులో హాజరు పరచడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఒక ఎలుకను పోలీసులు బంధించడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్రంలోని చింద్వారాలోని కొత్వాల పోలీస్ స్టేషన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.



ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎలుకను అక్రమ మహత్యం కేసులో బంధించారు పోలీసులు. అక్రమ మద్యం కేసులో కొత్వాలా పోలీసులు 60 మద్యం బాటిల్స్ సీజ్ చేశారు  అయితే కేసు కోర్టులో ఉండగానే మద్యం బాటిల్స్ మాయమయ్యాయి. అయితే ఆ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి ఎలుకలు తాగేసాయి అంటూ ఏకంగా పోలీసులు ఒక ఎలుకను పట్టుకొని బంధించారు. మరికొన్ని ఎలుకలను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అవి పారిపోయాయి అంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు పోలీసులు. కాగా చింద్వారాలో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

Rat