అయితే ఇది నిజమేనా భర్తలను అడిగితే.. ముమ్మాటికి నిజమే.. అది అతని ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అందుకే భర్తల అందరి లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని ఇలా మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు మగాళ్లు. అయితే ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత నిజంగానే పెళ్లి తర్వాత లైఫ్ భార్య చేతిలో కీలుబొమ్మ లాగా ఉంటుందా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. అది సరేగాని ఇప్పుడు భార్యాభర్తల బంధం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా. సాధారణంగా ఏ చిన్న గొడవ జరిగిన భార్య చీటికిమాటికి అలుగుతూ పుట్టింటికి వెళ్లడం చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
ఇలా పుట్టింటికి వెళ్ళిన భార్యను బ్రతిమిలాడుకొని మరి మళ్ళీ భర్త ఇంటికి తెచ్చుకుంటాడు. అయితే ఇలా భర్త తప్పు లేకపోయినప్పటికీ భార్య అలిగి చీటికి మాటికి పుట్టింటికి వెళ్లడం మానసిక క్రూరత్వమే అంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. పరస్పర సహకారం, విధేయత ఉన్నప్పుడు మాత్రమే వివాహ బంధం కలకాలం నిలబడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల కాలంలో కాలంలో ఏడుసార్లు భార్య తనను విడిచిపెట్టిందని.. వెళ్ళిన ప్రతిసారి మూడు నుంచి పది నెలలు పుట్టింట్లోనే ఉండేదని.. అందుకే తన భార్య నుంచి విడాకులు కావాలంటు భర్త కోరగా.. అతని వాదన విన్న కోర్టు అతను విడాకులు తీసుకోవడం సభబే అంటూ తేల్చి చెప్పింది.