సాధారణంగా ఎప్పుడు ఎన్నో రకాల సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఎన్ని రకాల సినిమాలు విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్  సినిమాలకు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎంతో మంది సినీ అభిమానులు ఇలాంటి సినిమాలను చూడడానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో ఉండే ట్విస్టులను చూస్తూ ఏకంగా ఆ ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినీ ప్రేక్షకులు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఏకంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో ఉండే ట్విస్టుల కంటే ఎక్కువ ట్విస్టులు ఉన్న స్టోరీలు నిజజీవితంలోనే బయటపడుతూ ఉన్నాయి.


 ఏకంగా ఇలాంటి ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు. ఇలాంటి స్టోరీలు కేవలం సినిమాల్లోనే ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే ట్విస్టులతో కూడిన ఘటనలు జరుగుతున్నాయ్ అని అనుకుంటున్నారు ఎంతోమంది. ఎందుకంటే నేరాలకు పాల్పడేందుకు ఎంతో మంది భిన్నమైన దారులను వెతుకుతున్నారు. సినిమాల ప్రభావమొ లేకపోతే ఇంకేంటో తెలియదు. కానీ ఇక పోలీసులకు సైతం అంతుచిక్కని విధంగా నేరాలు చేయడంలో కూడా క్రియేటివిటీ చూపిస్తున్నారు ఎంతోమంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి.



 కర్ణాటకలో ఒక షాకింగ్ ఘటన జరిగింది సంత. బెంగళూరులో పెట్రోల్ పంపు వద్ద డెడ్ బాడీ ఉందని సమాచారంతో దేవా
 నగర పోలీసులు కుక్కతో అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ నుంచి వాసన చూస్తూ వర్షంలో ఎనిమిది కిలోమీటర్లు పరిగెత్తింది కుక్క. ఈ క్రమంలోనే ఒక ఇంటికి వెళ్ళింది. అయితే కేకలు వినిపించడంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి భర్త రంగస్వామి చేతుల్లో చావబోతున్న మహిళ రూపను కాపాడారు. అయితే రూపతో అక్రమ సంబంధం పెట్టుకున్న సంతోష్ ను భర్త రంగస్వామి చంపిన తర్వాత ఇక భార్యను కూడా చంపేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం ఆ తర్వాత పోలీస్ బయటపడింది. ఇలా ఒక హత్య మిస్టరీని ఛేదించేందుకు వెళ్తే మరో హత్య చేదించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: