ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే.. కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాలను పట్టుకునే వేలాడుతూ ఉన్నారు. ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో కొంతమంది ఇంకా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మానేసి.. ఏకంగా మాంత్రికుడు దగ్గరికి వెళ్లి తాయత్తు కట్టించుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఇంకా టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న దేశాన్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి.


 ప్రజల మూఢనమ్మకాలనే క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది బురిడీ బాబాలు ఇక అందిన కాడికి దోచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా భారీగా డబ్బులు దండుకుంటుంటే ఇంకొంతమంది ఏకంగా మహిళల మానప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చిన ఇంకా మూఢనమ్మకాల ఊబిలోంచి కొంతమంది జనాలు బయటికి రాలేకపోతున్నారు. ఇంకా బురిడీ బాబాల మాయలోనే మునిగి తేలుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా అనారోగ్యంతో ఉన్న ఒక యువతి డాక్టర్ దగ్గరికి వెళ్లడం మానేసి మాంత్రికుడు దగ్గరికి వెళ్ళింది.


 ఈ క్రమంలోనే అనారోగ్యంతో ఉన్న ఆ యువతికి బాగు చేస్తాను అని చెప్పిన మాంత్రికుడు చివరికి యువతి తలలోకి 22 సూదులను గుచ్చాడు. ఈ ఘటన ఒడిశాలోని సిందికేలాలో వెలుగులోకి వచ్చింది. రేష్మ అనే యువతీ తరచు అనారోగ్యానికి గురవుతుంది. దీంతో ఆమె తండ్రి విష్ణు బెహరా మాంత్రికుడు తేజ్ రాజ్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే సదురు మాంత్రికుడు చికిత్స నిమిత్తం యువతి తలలోకి 22 సూదులను గుచ్చాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయింది. వెంటనే ఆమె తండ్రి ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా.. తలలో నుంచి ఏకంగా ఎనిమిది సూదులను బయటకి తీశారు వైద్యులు. అయితే ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు మాంత్రికుడు తేజ్ రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: