ఓ ఐఏఎస్ అధికారి భార్య పక్కదారి పట్టింది. ఒకానొక సమయంలో తనకు పరిచయమైనటువంటి గ్యాంగ్ స్టర్ తో కలిసి నేరాలకు పాల్పడింది. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.... ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో ఆ విషయం తెలుసుకున్న తన భర్త విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. విడాకుల విషయాన్నీ తెలుసుకున్న ఆమె తిరిగి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....


గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్ జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ తో పరిచయం ఏర్పడిందట. 9 నెలల క్రితం వారితో కలిసి ఇంటి నుంచి ఆమె వెళ్లిపోయిందట. వీరిద్దరూ కలిసి జులై 11వ తేదీన తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇక మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటినుంచి గ్యాంగ్ స్టార్, సూర్య జై కోసం పోలీసులు గాలించడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీ నగర్ లోని తన భర్త రణ్ జీత్ కుమార్ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్ అధికారి ఆమెను తన ఇంట్లోకి రావడానికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన సూర్య జై విషం తాగి 108కు ఫోన్ చేసింది. ఇక తక్షణమే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఇక సూర్య జై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

ఈ ఘటనపై రణ్ జీత్ తరపు న్యాయవాది స్పందిస్తూ.... ఐఏఎస్ దంపతులు ఇద్దరూ గత సంవత్సరం నుంచి వేరువేరుగా ఉంటున్నారు. రణ్ జీత్ విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా ఆమెను లోనికి అనుమతించొద్దని రణ్ జీత్ తన పని వాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అని తెలిపారు. కాగా.... ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: