ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు.. మానవ మృగాలేమో అనే భావన అందరిలో కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనుషులకు ఏదైనా అపాయం కలిగితేనే అయ్యోపాపం అంటూ జాలిపడేవారు మనుషులు. జాలి పడటమేనా తోచినంత సహాయం చేయడానికి కూడా సిద్ధపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో అలా కాదు ఏకంగా చిన్న చిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇలాంటి ఘటనలు సభ్య సమాచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాక్లెట్ తిన్నంత ఈజీగా ఏకంగా మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు ఎంతోమంది. అది కూడా చిన్న చిన్న కారణాలకే. దీంతో ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరు ఎలా దాడి చేసి ప్రాణాలు తీస్తారో అనే భయం ప్రతి ఒక్కరిలో కూడా నిండిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది  ఏకంగా యువకుడు యువతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. హాస్టల్లోకి వెళ్లి మరి దాడి చేసి ఇలా దారుణంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ గా మారిపోయింది.


 బెంగళూరులో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పీజీలో ప్రీతి అనే యువతపై ఉన్మాది దారుణంగా దాడి చేశాడు. పలుమార్లు కత్తితో పొడిచి గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. అయితే రక్తపు మడుగులో యువతీ రోదించడం సీసీటీవీలో రికార్డు అయింది.  పక్క గదుల్లోని తోటి విద్యార్థులు ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు. యువతీని చూసినప్పటికీ టెన్షన్తో ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో చివరికి ఇలా రక్తపు మడుగులో ఏడుస్తూ ప్రాణాలు వదిలింది యువతి. అయితే తన ప్రియురాలిని విడగొట్టింది అన్న కారణంతో పగ పెంచుకొని అతడు ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: