కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌమితాపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అత్యాచారం హత్యకు గురైన బాధితురాలీ శరీరంలో ఎక్కువ మొత్తంలో వీర్యం లభించడం శరీరంపై దారుణంగా బలమైన గాయాలు ఉండడం మరింత సంచలనంగా మారింది. అయితే ఎక్కువ మొత్తంలో వీర్యం లభించిన నేపథ్యంలో సదరు జూనియర్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికి ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


 అయితే ఈ దారుణమైన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. జూనియర్ డాక్టర్ అత్యాచార నిందితులకు కఠిన శిక్ష విధించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమంది నిరసనలు కూడా చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇటీవలే జూ డాక్టర్  అత్యాచార ఘటనపై ఒక మహిళ స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింప చేస్తుంది. కోల్కతాలోని సోనాగచి రెడ్ లైట్ ఏరియా కు చెందిన ఒక మహిళ యువ వైద్యురాలపై దారుణ అత్యాచారం గురించి అందరిలా కాకుండా భిన్నంగా స్పందించింది. కొన్ని నిమిషాల సుఖం కోసం స్త్రీలను అత్యాచారం చేసి చంపే బదులు.. రెడ్ లైట్ ప్రాంతాలను సందర్శించాలని సదరు మహిళ పురుషులకు సలహా ఇచ్చింది.



 మీకు ఆడవాళ్ళ మీద మోజు ఉంటే మా దగ్గరికి రండి. దయచేసి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. అత్యాచారానికి ఒడికట్టి వారి జీవితాలను రోడ్డుపాలు చేయకండి. ఇక్కడ ఇంత పెద్ద రెడ్ లైట్ ఏరియా ఉంది. మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ 20 నుంచి 50కి పనిచేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి బయటికి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేయకండి. ఇప్పటికైనా మారండి అంటూ కామాంధులను ఆమె వేడుకున్న తీరు అందరిని ఆలోచింప చేస్తుంది. అయితే సదరు మహిళ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్నమైనవాదనలు వినిపిస్తున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: