నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలను చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా కామంతో కళ్ళు మూసుకుపోతున్న ఎంతోమంది మగాళ్లు అడవుల్లో ఉండే మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాము మనుషులమే అన్న విషయాన్ని మరిచిపోయి ఏకంగా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.


 అయితే ఇలా అత్యాచారం చేస్తున్న కామాంధులకు కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తున్న ఎక్కడ కామందులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగారీత్యా వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి రావడంతో తన భార్యను ఒంటరిగా ఇంట్లో ఉంచలేక బంధువులకు అప్పగించి వెళ్ళాడు భర్త. కానీ అక్కడే మంచి వాడి ముసుగులో కామంతో కళ్ళు మూసుకుపోయిన రాక్షసుడు ఉన్నాడని గ్రహించలేకపోయాడు. సొంతవాడు అనుకున్న మేనల్లుడే ఏకంగా అతని భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణమైన కఠిన ఝార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది. బొకారి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు తన మేనత్త పై అత్యాచారానికి పాల్పడ్డాడు.


 బాధితురాలి భర్తకు గోవాలో ఉద్యోగం రావడంతో భార్య పిల్లలను తన చెల్లెలు ఇంట్లో వదిలి వెళ్లాడు. అయితే అత్త అంటూ మంచి వాడిలాగే నటిస్తూ ఉన్న ఓ యువకుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు  అంతేకాకుండా విషయం ఎవరికైనా చెబితే పిల్లల ప్రాణాలు తీస్తాను అంటూ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో పిల్లల ప్రాణాలు పోతాయేమో అని భయపడిన మహిళ వెంటనే ఫిర్యాదు చేయలేదు. ఇక తర్వాత ఓ రోజు ధైర్యం చేసి పంచాయతీ పెద్దలతో తన బాధను చెప్పుకుంది. అయితే వారు న్యాయం చేయలేదు. ఇక భర్త వచ్చేంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేం అంటూ తెగేసి చెప్పేశారు. ఇటీవలే భర్త ఇంటికి రావడంతో జరిగిందంతా ఆ మహిళ చెప్పింది. దీంతో భార్యని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశాడు భర్త. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: