నేటి రోజుల్లో ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే.. కొంతమంది జనాలు మాత్రం ఇంకా అనాగరికత వైపే అడుగులు వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అందరూ టెక్నాలజీ సహాయంతో చంద్రుడు మీద అడుగు పెడుతుంటే కొంతమంది మాత్రం ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్ముతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి ఇంకా దొంగ బాబాల మాట మాయమాటలు నమ్మి ఎంతోమంది జనాలు మోసపోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా జనాల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్న ఎంతో మంది బురిడీ బాబాలు ఇక అందిన కాడికి దోచుకు పోలడం కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఏకంగా మహిళల మానప్రాణాలను కూడా దోచుకుంటూ దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే తన మాయమాటలతో జనాలను నమ్మించేందుకు ప్రయత్నించాడు. దయ్యాలు ఉన్నాయి తాయత్తు కడతాను అంటూ మాయమాటలు చెప్పాడు. కానీ అతని మాటలు నమ్మని జనాలు అతనికి దేహ శుద్ధి చేశారు.


 ఇలా మాయమాటలు చెప్పి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దొంగ బాబాను చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మీ ఇంటికి నరదృష్టి ఉందని అంతేకాదు మీ ఇంట్లో ఆత్మలు ఉన్నాయి మాట్లాడుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేసాడు. ఒక వ్యక్తి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తే తాయత్తు ఇస్తా. మీ ఇంట్లో దయ్యాలను మాయం చేస్తా. డబ్బు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది అంటూ మహిళలను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో స్థానికులు ఇది గమనించి అతని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే ఎవరు దొంగ బాబాలను నమ్మి మోసపోవద్దు అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: