సాధారణంగా భార్యా భర్తల బంధం అనేది అన్యోన్యతకు కేరఫ్ అడ్రస్ గా ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఒకసారి పెళ్లి అనే బంధంతో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టిన తర్వాత.. ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కష్ట సుఖాల్లో అండగా నిలబడాలి.. ఇక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు సర్దుకు పోయి బంధాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడా భార్యా భర్తల మధ్య కనిపించడం లేదు.


 చిన్నచిన్న కారణాలకి ఏకంగా అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు కూడా విడాకులు తీసుకున్నందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా భార్యాభర్తలు కాదు.. బద్ధ శత్రువులు అనే విధంగానే ఒకరిపై ఒకరు కోపం పెంచుకుంటున్నారు. చివరికి కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. భర్త అన్న ఒక్క మాటతో కోపంతో ఊగిపోయిన భార్య అతనిపై కేసు పెట్టింది.


 చివరికి జరిగిన విషయం గురించి తెలిసి కోర్టు ఏకంగా భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్అవుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని చెప్పిన భర్త పై భార్య ఏకంగా ఐ.పి.సి 498 ఏ సెక్షన్ కింద గృహహింస కేసు పెట్టింది. దీంతో ఆ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. విచారణ చేపట్టిన జడ్జి నాగప్రసన్న మాట్లాడుతూ ఇలా కేసు పెట్టడం చట్టాలను దుర్వినియోగం చేయడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త పై చర్యలు తీసుకుంటే.. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్లే అవుతుంది అంటూ సదరు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: