తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు పెరుగుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ పోయిందని... పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మొన్నటి నుంచి జనాలు మొత్తుకుంటున్నారు. అయితే తాజాగా... హైదరాబాద్ పోలీసుల గురించి సంచలన విషయం తెరపైకి వచ్చింది. కడుపుకూటికోసం... వ్యభిచార గృహాలలో పని చేస్తున్న యువతులను టార్గెట్ చేసి కొంతమంది పోలీసులు వేధిస్తున్నారట.


ఈ సంఘటనలో ముగ్గురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ముగ్గురు కానిస్టేబుళ్లు తాజాగా సస్పెండ్ కావడం జరిగింది. దామోదర్, నాగరాజు అలాగే సతీష్ లను... సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు... మధురానగర్ పరిధిలో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో... పనిచేస్తున్న మహిళల నుంచి డబ్బులు తీసుకుంటున్నారట. వారి నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుని.. జల్సాలకు పాల్పడుతున్నారట. అంతేకాదు వారితో రాసలీలల్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే పై అధికారులకు చెబుతామని ఆ మహిళలు  హెచ్చరిస్తే... మీ దంతా నడవకుండా చేస్తామని కానిస్టేబుల్ వార్నింగ్ ఇస్తున్నారట.

 
అలాగే స్పా సెంటర్లో కూడా ఈ ముగ్గురు కానిస్టేబుల్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు కానిస్టేబుల్ తో పాటు మరో హోంగార్డు కూడా ఉన్నారని సమాచారం. ఈ నలుగురు స్పా సెంటర్లకు ఇటు వ్యభిచార గృహాలకు వెళ్లిన...  వీడియో ఫుటేజ్ పోలీసులకు దొరికింది. ఇంత ముగ్గురు కానిస్టేబుల్ పై  అధికారులు వేటు వేశారు. అదే సమయంలో హోంగార్డును... ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: