నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంది. ఈ భూమి మీద ఎన్నో రకాల జీవాలు ఉన్నప్పటికీ మనిషి ఒక్కడే జాలీ దయ గుణాలకు అనే చిరునామాగా ఉన్నాడు. అంతేకాదు విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయం కేవలం మనిషికి మాత్రమే తెలుసు. అందుకే అన్ని జీవుల్లోకెల్లా మనిషి ప్రత్యేకమైన జీవిగా మారిపోయాడు. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటుంటే.. మనుషుల్లో ఉండే విచక్షణ జ్ఞానమే పూర్తిగా తగ్గిపోయిందేమో అనే భావన అందరికీ కలుగుతుంది.


 ఎలాంటి సమయంలో అయినా సరే విచక్షణతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే మనిషి.. నేటి రోజుల్లో మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు. మనిషి కాదు మానవ మృగంలా మారిపోయి దారుణంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకే ఈ మధ్యకాలంలో చాక్లెట్ తిననంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు సాటి మనుషులు. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ బెంగుళూరులో కూడా ఇలాంటి ఓ దారుణ హత్యకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.


 బెంగళూరు విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే ఓ దారుణ హత్య జరిగింది. తన భార్యతో ఎయిర్పోర్టులో ట్రాలీ ఆపరేటర్ గా పనిచేసే రామకృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే అనుమానంతో రమేష్ అనే వ్యక్తి అతనిపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. టెర్మినల్ ఒకటి లోని అరైవల్ పార్కింగ్ ఏరియాలో వాష్ రూమ్ వద్ద రామకృష్ణ మెడను కోసేసాడు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో రామకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయి రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాడు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: