నేటి రోజుల్లో మనిషి టెక్నాలజీ మీద ఎంత అతిగా ఆధారపడిపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని పనులను కూడా ఎంతో సులభంగానే పూర్తి చేసేస్తూ ఉన్నాడు. చెమట చుక్క చిందించకుండానే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో అన్ని పనులు జరిగిపోతున్నాయి అని చెప్పాలి. తినే ఆహారం దగ్గర నుంచి వేసుకునే చెప్పుల వరకు అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇక ఆర్థిక లావాదేవీలను కూడా ఒక్క క్లిక్ తో పూర్తి చేస్తున్నాడు.


 అయితే ఈ మధ్యకాలంలో అటు ప్రయాణాలు సాగించడం విషయంలో కూడా టెక్నాలజీ మీదే ఆధారపడిపోతున్నాడు మనిషి. ఒకప్పుడు తెలియని ప్రదేశాలకు వెళ్ళాలి అంటే రోడ్డుపై కనిపిస్తున్న వ్యక్తులను దారి అడుగుతూ ముందుకు సాగే వారు ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని.. అది ఎటు తిప్పితే అటే వెళ్తూ ఉన్నారు. అయితే గూగుల్ మ్యాప్ ని గుడ్డిగా ఫాలో అయితే చివరికి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల ద్వారా అందరికీ అర్థమవుతుంది. అయితే ఇటీవలే విజయవాడలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని తల్లి కొడుకు బు డమేరు వాగులో చిక్కుకొను ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగు లోకి వచ్చింది. శ్రీశైలం దర్శనం ముగించుకున్న 9 మంది గూగుల్ మ్యాప్ పెట్టుకొని కారు లో రిటర్న్ అయ్యారు. అయితే గూగుల్ మ్యాప్ నేరుగా వారిని తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా సిరసవాడ దుందుభి వాగులోకి తీసుకు వెళ్లింది. అక్కడ చిక్కుకున్న వారిని ఏకంగా గ్రామస్తుల సహాయం తో పోలీసులు ట్రాక్టర్ తో సహా సురక్షితంగా బయటకు తీయగలిగారు. ప్రాణాపాయం ఏమి జరగకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: