ఏంటో.. నేటి సభ్య సమాజంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయిందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే దీనికి అంతటికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఒకప్పుడు పక్క వాళ్ళు ఎటు పోతే మాకేంటి.. నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నామా లేనా అని స్వార్థపూరితంగా ఆలోచించేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఇక కుటుంబం గురించి కూడా పట్టించుకోవట్లేదు. నేను సంతోషంగా ఉన్నానా లేనా.. కుటుంబం ఎటు పోతే ఏంటి అన్న విధంగా ఆలోచన చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 అంతే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా మానవత్వాన్ని చూపించకుండా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారు మనుషులు. దీంతో సొంత వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకడుగు వేయని ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయ్. మరీ ముఖ్యంగా ఇక రక్తం పంచుకొని పుట్టిన పిల్లల విషయంలో కూడా కర్కషత్వంతో ప్రవర్తిస్తున్నారు ఎంతోమంది తల్లిదండ్రులు. ఇక్కడ ఒక తండ్రి ఇదే చేశాడు. తండ్రి అంటే భరోసాగా ఉండాలి. పిల్లలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను ధైర్యం చెప్పాలి. కానీ ఇక్కడ తండ్రి మాత్రం ఏకంగా సొంత బిడ్డనే అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు.


 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఈ ఘోరమైన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు ఒక తండ్రి మూడేళ్ల చిన్నారిని అమ్మేశాడు. తన భార్య ఆసుపత్రి లో ఆరో బిడ్డకు జన్మనివ్వగా.. బిల్లు కడితేనే ఇంటికి పంపుతానని యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో తన మూడేళ్ల కొడుకుని అమ్మకానికి పెట్టాడు తండ్రి. ఇది కాస్త స్థానికంగా చేర్చనీయాంశం గా.. మారడం తో రంగం లోకి దిగిన పోలీసులు ఇలా చిన్నారి అమ్మకానికి చర్చలు జరిపిన ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. అంతేకాదు సదరు చిన్నారిని మళ్లీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: