విధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలు బొమ్మలు మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వెలుగు లోకి వచ్చే కొన్ని ఘటనలు చూసినప్పుడు మాత్రం ఇది ముమ్మాటికి నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్న సమయం లో ఊహించని ఘటనలు ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతూ ఉంటాయి. ఇక ఎంతోమంది ప్రాణాలను కూడా తీసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో అప్పటి వరకు సంతోషం గా గడిపిన వారు.. చివరికి అరణ్య రోదనలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక నవ వధువుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణం గా ఎంతో మంది అమ్మాయిలు పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. మెట్టినింట్లో  అడుగు పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి కూడా ఇలాగే అనుకుంది. ఇక ఎంతో సంతోషం గా పెళ్లి చేసుకొని మెట్టినింట్లో అడుగు పెట్టింది. కానీ కాళ్ల పారాణి ఆరకముందే ఆమె పసుపు కుంకాలు తెగి పోయాయి.

 పెళ్లి జరిగిన ఆనందం రోజులు కూడా నిలవలేదు. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా మెట్టినింట్లో అడుగు పెట్టిన యువతీ చివరికి పెళ్లయిన ఐదు రోజులకే భర్తను కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఏపీలో వెలుగు లోకి వచ్చింది. చిత్తూరు జిల్లా వి. కోటలో జరిగింది. కర్ణాటక సరిహద్దు వెంగసంద్రం కు చెందిన 28  ఏళ్ళ కార్తీక్ రామకుప్పం మండలం కొల్లుపల్లి వాసి భవానితో ఇటీవల పెళ్లయింది. అయితే ఇటీవలే చాతి నొప్పి రావడం తో భార్య తో కలిసి ఆసుపత్రికి వెళ్ళాడు కార్తిక్. చివరికి గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: