తూర్పు గోదావరి జిల్లాలో తాజాగా అత్యంత దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక ఓల్డ్ కపుల్ టీ పౌడర్ అనుకొని పురుగుల మందుతో టీ చేసుకుని తాగారు. అంతే, ఈ వృద్ధ దంపతులు పైలోకానికి వెళ్లిపోయారు. రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ వృద్ధ దంపతుల పేర్లు గోవింద్ (75), అప్పాయమ్మ (70). వీరిద్దరూ కలిసి ఏం లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఒక రోజు ఓ కోతి పురుగుల మందు ప్యాకెట్ తీసుకొచ్చి వీరి ఇంటి ముందే పడేసింది. అప్పాయమ్మ దాన్ని చూసి టీ పొడి అనుకుంది. ఆమె కంటిచూపు బాగా మందగించింది దానివల్లే టీ ప్యాకెట్ కి పురుగుల మందు ప్యాకెట్ కి మధ్య తేడాను తెలుసుకోలేకపోయింది.

భర్త గోవింద్ టీ పెట్టమని అడిగినప్పుడు ఇంటి ముందు దొరికిన పురుగుల మందుతో టీ తయారుచేసింది  అప్పాయమ్మ. వృద్ధ దంపతులిద్దరూ ఒకేసారి ఆ టీ తాగేశారు. కాసేపటి నోటి నుంచి నురగలు వరదలా బయటికి వచ్చాయి. వారు ప్రాణాలతో కొట్టుమిట్టాడటం చూసిన స్థానికులు వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అయితే వైద్యులు వీరి ప్రాణాలను కాపాడేందుకు చాలా ట్రై చేశారు కానీ దురదృష్టం కొద్దీ వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. వారు ఒక కేసు ఫైల్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ విధంగా ఒక కోతి పొరపాటున వారి ఇంటి ముందు వేయడం వల్ల వారు చనిపోయారు. ఈ ఓల్డ్ కపుల్ అనుకోకుండా చాలా విషాదకరమైన రీతిలో చనిపోవడం గురించి తెలుసుకుని స్థానికులు అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఎవరికీ జరగని దారుణం వీరికి జరిగిందని మాట్లాడుకుంటున్నారు. ఇంటి ముందు లేదా బయట ఎక్కడైనా సరే దొరికిన ప్యాకెట్లను ఉపయోగించకపోవడమే మంచిది అని వైద్యులు  సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: