ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేయడానికి కూడా మనుషులు సిద్ధమవుతున్న తీరు సభ్య సమాజం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఏకంగా వావి వరసులు మరిచిపోయి మరి అక్రమ సంబంధాలకు తెర లేపుతూ ఉన్నారు. అయితే అటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కూడా  కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఒక సంచలన కేసు వెలుగులోకి వచ్చింది.


 కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలు పై కన్నేశాడు.  చివరికి ఆమె ఒంటరిగా ఉన్న ఒకరోజు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి ఇక బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే తన భర్తకు బాధ చెప్పుకోవాలని అనుకుంది. భర్త ఇంటికి వచ్చాక జరిగిన విషయం చెబితే భర్త ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. సాయం చేయకపోగా నా తండ్రి అత్యాచారం చేసినందుకు ఇకనుంచి నా తల్లి లాంటి వరుస అవుతావు అంటూ ఇక కొట్టి ఇంట్లో నుండి  వెళ్ళగొట్టాడు. చివరికి బాధితురాలు పుట్టింటికి వెళ్లి కొన్నాళ్లపాటు భర్త తన దగ్గరికి వస్తాడు అని ఎదురు చూసి.. ఇక ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.



 పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు ఇక జరిగిందంతా చెప్పింది. తన మామ బలవంతంగా తనపై అత్యాచారం చేశాడని.. ఇక ఈ విషయం భర్తకు కూడా చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే మా నాన్న బలవంతంగా నీతో సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు నిన్ను నా దగ్గర ఉంచుకోలేను. ఎందుకంటే నువ్వు నా తండ్రికి భార్య.  నాకు తల్లి లాంటి దానివి అంటు నా భర్త నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించాడు. చాలా రోజులు వేచి చూసిన తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితురాలు పేర్కొంది ఈ క్రమంలోనే మామ వార్తలపై 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇతరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: