ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనది.. బల్బును కనిపెట్టిన ఎడిసన్ అయినా.. శాస్త్రవేత్తగా అత్యున్నత స్థాయికి ఎదిగిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అయినా.. అంతెందుకు ఇక ఇప్పుడు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ దేవుడిగా మారిన సచిన్ టెండూల్కర్ అయినా ఒకప్పుడు ఒక గురువుకి శిష్యుడే. సాధారణంగా మనిషికి తల్లిదండ్రులకు జన్మనిస్తే ఆ జన్మను సార్ధకం చేసేది సరైన మార్గంలో నడిపించేది మాత్రం గురువులే అని చెప్పాలి. అందుకే గురు శిష్యుల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే.


 ఇలా సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న టీచర్లు ఈ మధ్యకాలంలో మాత్రం దారి తప్పుతున్నారు. ఏకంగా తమ దగ్గరకు చదువుకోడానికి వచ్చిన విద్యార్థులకు పాఠాలు నేర్పాల్సింది పోయి.. ఇక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో కూడా ఇలాంటి ఓ దారుణకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 51 ఏళ్ళ టీచర్ తన దగ్గర చదువుకునే బాలుడితో కామ కలాపాలు కొనసాగించడం మొదలు పెట్టింది. చివరికి ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.



 టెక్సాస్ గార్డెన్ రిచ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో  ఓ కుర్రాడు ఒక మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు  అక్కడికి చేరుకున్న పోలీసులు లోపల జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. 51 ఏళ్ల జెనీఫర్ మాసే అనే టీచర్ తన స్టూడెంట్ తో కలిసి రాసలీల కొనసాగిస్తూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. అయితే విద్యార్థి వయస్సు ఎంత అన్న విషయం మాత్రం బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. విద్యార్థితో అక్రమ సంబంధం సహ పలు సెక్షన్లు కింద ఆ టీచర్ పై కేసు నమోదు చేశారు  ఒకవేళ నేరం రుజువైతే ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పదివేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: