శవంతో సహజీవనం చేశారు ఇద్దరు అమ్మాయిలు. తల్లి శవంతో ఇంట్లోనే 8 రోజులు ఇద్దరు కూతుళ్లు ఉన్న సంఘటన హైదరాబాద్‌ లో తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. ఈ దారుణమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధి బౌద్దనగర్ లో మహిళా మృతి కలకలం రేపింది. మృతదేహంతో ఇద్దరు కూతుర్ల సహజీవనం చేశారు. 50 ఏళ్ల తల్లి ఇంట్లో గుండెపోటుతో మరణించిందని సమాచారం. అయితే..ఆ తల్లితో పాటు ఆత్మహత్యకు ప్రయత్నించారట కూతుర్లు.

అయితే...8 రోజులు కావడంతో...  దుర్వాసన వస్తుందని స్థానికులు అందరూ చర్చించుకున్నారు. ఇక ఈ విషయంపై స్థానికులు ఆరా తీయడంతో ఈ ఘటన బయట పడింది. ఇక తల్లి కూతుళ్లు రెండు నెలలుగా అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు ఇంటి యజమాని. మతిస్థిమితం లేనట్లు ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.  అనుమాన స్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని గాంధీ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.


5 ఏళ్ల క్రితం భర్త వదిలి వేయడంతో కూతుర్లతో కలసి ఉంటోందట లలిత. అటు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు లలిత కూతుర్లు.  ఇక తల్లి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు కూతుర్లు. ఇందులో భాగంగానే...  చేతులు కోసుకున్నారు కూతుర్లు. ఇక ఈ విషయం బయటకు రావడంతో... పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు కూతుర్లు.

ఈ తరుణంలోనే.. కొత్త విషయాలు బయటకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మా సూసైడ్ కారణం మా మేనమామ బిట్ల రమేష్ , ప్రకాష్ రెడ్డి, తండ్రి సి ఎల్ రాజు అని లేఖలో రాశార కూతుళ్లు రవళిక. యశ్విత. ఇక ఇవాళ నేడు లలిత మృతిదేహానికి గాంధీ మార్చురిలో పోస్టుమార్టం చేయనున్నారట.  మానసిక ఒత్తిడిలో ఇద్దరు కూతుళ్లు రవళిక & యశ్వీత ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. ట్వీట్‌ మెంట్‌ అందిస్తున్నారు. అటు.. బిట్ల రమేష్ , ప్రకాష్ రెడ్డి, తండ్రి సి ఎల్ రాజు లను పిలిపించి ఆరా తీస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: