
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ కామాంధుడు. ఎంఎంటీఎస్.. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళపై దారుణంగా వ్యవహరించాడు. మొదటగా మాట్లాడి.. ఆ తర్వాత దగ్గర అయ్యే ప్రయత్నం చేశాడు. మాట మాట కలిపి... దారుణానికి ఒడిగట్టాడు. అయితే.. ఇద్దరు ప్రయాణిస్తున్న ఎంఎంటిఎస్ భోగిలో... ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఒక్కో స్టాప్ లో దిగిపోయారు. అయితే కొంపల్లి వచ్చే సమయానికి.. ప్రయాణికులందరూ దిగగా ఈ ఇద్దరు మాత్రమే మిగిలారు..
ఇదే అదునుగా చేసుకున్న ఆ కామాంధుడు.. ఆ మహిళపై లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. భోగిలో ఒక్కతే ఉండటంతో.. ఆ మహిళ ఏం చేయలేకపోయింది. కాపాడండి అంటూ భోగిలో అరుస్తూ మహిళ అర్ధనాథాలు చేసింది. అయితే రన్నింగ్ ట్రైన్ కావడంతో... ఆమె బాధలు ఎవరికి వినిపించలేదు. అయితే చేసేదేమీ లేక.. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది ఆ మహిళ.
దీంతో ఇది చూసిన స్థానికులు... వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై వివరాలు తెలుసుకున్న పోలీసులు... నిందితుడు పై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ నిండితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై... సీసీ కెమెరాలు... ఇతర ఆధారాలను పరిశీలించి... నిందితుడి కోసం వెతుకుతున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.