తెలంగాణ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ భవనం కూలి ఏకంగా ఏడు మంది మరణించారని వార్తలు వస్తున్నాయి. ఈ దారుణమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కాసేపటి క్రితమే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో... నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మరణించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివారు ప్రాంతంలో.... ఓ బిల్డర్.. కొత్తగా నిర్మిస్తున్న భవనం ఒకసారిగా కుప్ప కూలింది.

 అయితే ఆ భవనం దగ్గర పని చేస్తున్న.. కార్మికులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొదట ఆరు మంది... ఈ భవనం కింద పడి దుర్మరణం చెందినట్లు అంచనా వేశారు. కానీ ఆ సంఖ్య ఏడుకు చేరిందని తాజాగా స్థానికులు చెబుతున్నారు. భద్రాచలం లోని సలీం టీ స్టాల్ ముందు వీధిలో... ఆరంతస్తుల భవనం కుప్పకూలిందని సమాచారం అందుతోంది. గత ఏడాది కాలంగా ఈ ఆరంతస్తుల భవనాన్ని కడుతున్నారట.

 ఈ ఆరంతస్తుల భవనం యొక్క పనులు దాదాపు చివరి దశలోకి వచ్చాయని సమాచారం.  అయితే ఈ నేపథ్యంలోనే... సాంకేతిక సమస్యల కారణంగా... ఈ భవనం కుప్పకూలిందని చెబుతున్నారు.   చనిపోయిన వారిలో ఆరుగురు కార్మికులు, మరో వ్యక్తి ఉన్నారని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరగగానే అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆర్తనాదాలు చేశారు.

 వెంటనే స్థానిక పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడం జరిగింది.  దీంతో క్షణాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ భవనం కింద ఇరుక్కున్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై... లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే మరణించిన వారి పేర్లు మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక భద్రాచలంలో జరిగిన ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: