తన గొయ్యి తాను తవ్వుకోవడం ఈ సామెతను చాలా సందర్భాల్లో విని ఉంటారు. ఇప్పుడు ఈ జాతీయయం ఓవరాక్షన్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు సరిగ్గా సరిపోతుంది. సివిల్ సర్వీస్ పరీక్షలు క్లియర్ చేయడానికి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి జాబ్ కొట్టింది. అక్కడితో గమ్మున ఉండకుండా ఈ అధికారాలు ఇవ్వండి.. ఈ సదుపాయాలు కల్పించండి అంటూ లేని పోని అధికారాల కోసం ఏకంగా ఓ కలెక్టర్ కి లేఖ రాసింది.


ప్రొబేషన్ పీరియడ్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దీంతో ఈమె ఆగడాలను తట్టుకోలేక పోయిన కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. చివరకు ఆమెను మరో చోటుకి బదిలీ చేశారు. అంతలోనే ఆమె వార్తల్లో నిలిచింది. ఆమె ఎంపికపై అనుమానాలు రావడంతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది.


కాగా.. ఆమె సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడానికి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడింది. దీంతో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ సెలక్షన్ రద్దు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పరిమితికి మించి తప్పులు చేసినందుకు ఈ చర్యలు తీసుకుంది. అలాగే ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. భవిష్యత్తులో యూపీఎస్పీ రాయకుండా కూడా ఆమెపై నిషేదం విధించింది. ఆమోదించదగని మోసాలకు పాల్పడినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.


వికలాంగుల హక్కులు, ఐటీ చట్టంలోని ఫోర్జరీతో సహా పలు సెక్షన్ల కింద కేసు దాఖలైంది. 2023 యూపీఎస్పీ ఫలితాల్లో 841 ర్యాంకు కొల్లగొట్టిన పూజా ఖేడ్కర్ పుణ్ కలెక్టరేట్ లో ప్రొబేషనరీ ఐఏఎస్ గా వర్క్ చేస్తోంది. దీంతో పాటు తన తల్లి, తండ్రి ఫొటో, సంతకం అన్నీ చివరకు చిరునామా అన్నీ కూడా ఫేక్ డాక్యమెంట్ సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆమె కారు, వసతి, ఛాంబర్, కానిస్టేబుల్ ఇవ్వాలంటూ గొంతెమ్మ కోరికలు కోరడంతో లేనిపోని అనుమానాలు వచ్చి చివరకు..చివరకు ఆమె ఉద్యోగం కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: