గాజాలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతూనే ఉంది. హమాస్ ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ తీవ్రవాదులు అత్యంత పాశవికంగా దాడులు చేసి కొంతమందిని బందీలుగా పట్టుకొని వెళ్లారు. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంటూనే ఉంది.


అయితే పాలస్తీనా వివాదం దేశానికి సంబంధించిన అంశం కాదు. లేదా ఇజ్రాయెల్ పాలస్తీనా ల మధ్య గొడవలు కాదు. ఇది ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ప్రపంచంపై ఇరాన్ సంధించిన అస్త్రం. పక్క దేశంపై మీద దాడులు చేయించి ఆ దేశస్థులతో పాటు విదేశీయుల్ని బంధీలుగా తీసుకెళ్లి..  దాని గురించి చర్చిద్దాం. అప్పటి వరకు దాడులు ఆపేద్దాం  అంటూ వారిని ఒక ఎరగా చూపించే ఒక కొత్త తరహా యుద్ధ తంత్రం.  దీనినే గెరిల్లా యుద్ధ తంత్రం అని కూడా అంటారు.


అయితే పాలస్తీనాకి సంబంధించి ఒక మత ప్రబోధకుడు ఇచ్చిన ఉపన్యాసం వైరల్ గా మారింది. దాని సారంశం ఏంటంటే.. పారిస్, రోమ్, మొత్తం యూరప్ భవిష్యత్తులో మనదే అవుతుంది. ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం ఏర్పడబోతోంది. మన మత రాజ్య స్థాపనకు అవకాశాలు ఉన్నాయి.  అప్పుడు వ్యభిచారం, స్వలింగ సంపర్కం వంటి వాటిని నిషేధిస్తాం. భవిష్యత్తులో మనదే హవా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.


అంటే పాలస్తీనా ఉద్యమాన్ని పెంచి పోషిస్తూ.. ఇరాన్ ఇస్లామిక్ రాజ్య స్థాపనకు కృషి చేస్తోంది. ఈ యుద్ధాల వల్ల లెబనాన్, పాలస్తీనా, ఎమెన్, సిరియా దేశాల్లోని ముస్లింలు ఇక్కడ బతకలేక వేరే దేశాలకు పారిపోతుంటారు. కానీ వీరంతా అరబ్ దేశాలకు వెళ్లరు. క్రైస్తవ దేశాలకు వలస వెళ్తారు.  అక్కడ ఉన్న ముస్లింలను ఏకం చేస్తున్నారు.  ఆ తర్వాత పాలస్తీనా అనుకూల ఉద్యమాలు చేయిస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్, అమెరికాలో జరుగుతున్నది అదే. పైగా ఇటీవల ఓ సర్వే యూరప్ దేశాల్లో ముస్లిం సంతతి  జనాభా పెరుగుతందని చెప్పింది. దీనికి కారణం కూడా ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: