ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పటికే క్లారిటీ రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ తప్ప సరైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడటం లేదు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? కొనసాగిస్తారా? లేకుంటే తొలగిస్తారా? అన్నది తెలియడం లేదు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని.. జీతం సైతం పదివేల రూపాయలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


 కానీ అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం దీనిపై అస్సలు ఫోకస్ లేదు. అసలు వాలంటీర్లను ఏం చేస్తే అన్నదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వారి ఆశలు సజీవంగా ఉండాలన్న భావనతో.. ఒక మంత్రి శాఖకు సంబంధించి వాలంటీర్లు అని పెట్టారు. అంతకుమించి.. ఏమీ చేయలేదు. దీంతో రెండున్నరల లక్షల మంది వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.  అటు వారి జీతాలు సైతం నిలిచిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు రాజీనామా చేయని లక్షన్నర మంది వాలంటీర్ల విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందనే టాక్ వస్తుంది.


అదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయంగా వాడుకుంటారు అన్న ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో జగన్ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ వాలంటీర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు ఛాన్స్ ఇచ్చారు.


అయితే ఎన్నికల ముందు వైసీపీ నేతల మాట విని చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అనవసరంగా వైసీపీ నేతలు విని రాజీనామా చేశామని వారు బాధపడుతున్నారు. అయితే ఇటువంటి తరుణంలో జగన్ కొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.  వాలంటీర్లకు వైసీపీ తరఫున జీతాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. వారితో పార్టీ పనులు చేయించుకునేందుకు సిద్ధపడినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఐదేళ్ల పాటు వీరికి జీతాలు ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.  మరి చూడాలి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: