బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల కుంభ కోణంపై రేవంత్ రెడ్డి సర్కారు  ఫోకస్ పెంచింది. దీనిపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించారు. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ ప్రారంభించింది. కేసీఆర్‌ సహా పలువరికి నోటీసులు పంపింది. అయితే అసలు ఈ కమిషన్‌కే చట్టబద్దత లేదని కేసీఆర్ సమాధాం ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కరెంట్‌ స్కామ్‌ న్యాయవిచారణకు కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.


విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలని నిండు సభలో వాటి విద్యుత్ శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి కోరారని .. న్యాయ విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అర్థం కావడం లేదన్న ఆయన.. అప్పులు చేసి సంపద సృష్టిస్తాం, ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.  మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్న  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది.....త్వరలోనే పనిచేసిన వారికి పదవులు అందుతాయన్నారు.


రైతు రుణమాఫీకి పూర్తిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో అధికారంలో ఉన్న బీసీల కుల గణనా చేపట్టాలి తద్వారా దేశ సంపద వనరులు పంచబడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలనలోను బీసీలను భాగస్వాములను చేయాలన్నదే మా డిమాండ్ అని  మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.


మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయన్న మల్లు భట్టి విక్రమార్క.. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడతామన్నారు. ఈ దేశ సంపద వనరులు దామాషా ప్రకారం పంచబడాలని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారని.. జనాభా దామాషా ప్రకారం సంపద పదవులు పంచాలని కోరారు.. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలు అమలు చేస్తున్నామని  మల్లు భట్టి విక్రమార్క వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: