వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉంది? సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే సొంతం చేసుకున్న ఆయన పని అయిపోయిందంటూ చేసే విమర్శలకు భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ పాత కేసులో అరెస్టై జైల్లో ఉన్న వేళ.. ఆయన్ను పరామర్శించేందుకు గుంటూరు జైలు వద్దకు వెళ్లారు.



ఈ సందర్భంగా అక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆయేషా బాను తన విధుల్ని నిర్వహిస్తూనే.. జగన్ వచ్చినంతనే ఆయన్ను కలిసేందుకు,.. ఆయనతో సెల్పీ దిగేందుకు ఆసక్తిని కనబరిచింది. అంతే కాదు తన కుమార్తెను వెంట తీసుకొని వచ్చినా ఆమె ఆయనతో కలిసి ఫొటో దిగేందుకు అనుమతి కోరిన వైనం ఆసక్తికరంగా మారింది.


అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషా బాను అందరి మధ్యంలోనుంచి లోపలకి వచ్చి.. జగన్ తో సెల్ఫీ దిగేందుకు అనుమతి కోరారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఆమెను. ఆమె కుమార్తెను ఫోటో దిగేందుకు జగన్ సరేనని చెప్పడంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందిగం సురేశ్ ఇతరుల్ని జైల్లో పరామర్శించిన జగన్ బయటకు వచ్చిన సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.


మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆయేషా బాను అనంతపురానికి చెందిన వారిగా చెబుతున్నారు. గుంటూరు జైల్లో విధులు నిర్వర్తిస్తున్న అంశం తాజాగా బయటకు వచ్చింది. ఆమె ప్రదర్శించిన అభిమానానికి ప్రతిగా జగన్ ఆమెతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన వైనాన్ని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం జగన్ మీద ప్రజల్లో ఉన్న అభిమానానికి ఒక ఉదంతంగా దీనిని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ కు మాత్రం మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: