దిల్లీ సీఎంగా తన తర్వాత అతిషిని ఎంపిక చేయడం వెనుక ప్రస్తుత సీఎం కేజ్రీవాల్ చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు రాజీనామా చేయాలన్న ఆలోచన దాదాపు నెల రోజుల క్రితమే వచ్చిందని చెబుతున్నారు. అయితే అప్పట్లో మౌనంగా ఉన్న కేజ్రీవాల్.. జైలు నుంచి బెయిల్ పై వచ్చిన రెండో రోజే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.  


ఆ వెంటనే రెండు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. వీటిలో తొలిపేరు అతిషీ కావడం గమనార్హం. రెండో పేరు సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత. సహజంగా సీఎం పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం కొత్తేం కాదు. ఇటీవల ఝార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ఇటీవల మళ్లీ సీఎం అయ్యారు. కొన్నళ్ల క్రితం గనుల కుంభకోణం కేసులో అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.



అయితే తన కుటుంబానికి విధేయుడైన చెంపయి సోరెన్ ఈ పదవిని చేపట్టారు. ఈయన బీజేపీతో చేతులు కలపడం.. ఇంతలోనే  హేమంత్ కు బెయిల్ రావడంతో మరోసారి సోరెన్ ప్రమాణం చేశారు. గతంలో బిహార్ సీఎం గా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో రాజీనామా చేసినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని సీఎం చేశారు. ఈ పరంపరంలో కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు వినిపించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ప్రచారాన్ని సునీతే తన భుజాలపై వేసుకున్నారు. దీంతో సీఎంగా కేజ్రీవాల్ ప్రకటించగానే సునీత పేరు కూడా తెరమీదకి వచ్చింది.


అయినా కూడా ఆమెను కాదని అతిషి వైపు కేజ్రీవాల్ మొగ్గు చూపారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్పేనాతో గత ఆరు మాసాలుగా ఢీ అంటే ఢీ అన్నట్లు అతిషి పోరాడారు. ఇక రెండోది అత్యంత కీలకమైన మొహల్లా క్లినక్స్. విద్యా వ్యవస్థలో మార్పులు వంటివాటికి అతిషీనే కారణం. ఈ రెండే పార్టీకి రెండో సారి అధికారం కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలోనే అతిషీ వైపు కేజ్రీవాల్ మొగ్గు చూపారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: