గత ఏడాది జులైలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి.. అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ లు మరోసారి ఏకం కావాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాను కుటుంబంగా కలిసే ఉన్నామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. అయితే ఆయన వేరే రాజకీయ పార్టీకి సారథ్యం వహిస్తున్నారని అన్నారు. కొంకణ్ తీర ప్రాంతంలోని చిప్లున్ లో జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ఎన్సీపీని చీల్చి షిందే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, శరద్ పవార్ లు తిరిగి కలవాలన్న వస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించింది.


దీనికి సమాధానంగా కనీసం ఇంట్లో అయినా మేం కలిసే ఉన్నాం అని శరద్ పవార్ తెలిపారు. కాగా.. లోక్ సభ ఎన్నికల్లో సోదరి సుప్రియా సూలేపై భార్య సునేత్ర పవార్ ను దించడం పొరపాటు నిర్ణయమని అజిత్ పవార్ వ్యాఖ్యానించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ బదులిచ్చారు. ఆయన వేరే పార్టీలో ఉన్నారు. వేరే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎందుకు వ్యాఖ్యానించాలి అని ఆయన అన్నారు.


ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి సీఎం అభ్యర్థిని నిర్ణయించిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం ఇది అత్యవసర సమస్యగా తాము భావించడం లేదని తెలిపారు. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాని అభ్యర్థిగా మొరార్జీ దేశాయ్ పేరుగా ముదుగా వెల్లడించలేదని గుర్తు చేశారు.


మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేతలు, రైతులు, కార్మికులు పార్టీ వంటి ఇతర పార్టీల సహాయంతో మహారాష్ట్రలో ప్రత్యామ్నాయ ప్రగతి శీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఎంవీఏ కూటమి ప్రయత్నం అని శరద్ పవార్ తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ కూటమికి అవకాశం ఇవ్వాలన్నది మహారాష్ట్ర ప్రజల మనసులో ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: