రాజకీయాల్లో ఎప్పుడు ఎవర్నీ ఏ రూపకంగా అదృష్టం వరిస్తుందో ఊహంచలేం. పదేళ్ల పాటు చతికిల పడిపోయిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా? అంతే మరి రాజకీయాల్లో మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని కూడా బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ అదృష్టవశాత్తూ ఆయన సీఎం పదవి చేపట్టారు. అలాగే కొన్ని ఉదంతాలు కూడా ఆయన పార్టీలకు కలిసొస్తుంటాయి.


సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ కు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల్లో చవి చూడాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇప్టపికే అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పార్టీకి హైడ్రా ఊపిరిపోసింది. హైడ్రా కాస్త బీఆర్ఎస్ కు అస్త్రంగా దొరికింది. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు కళ్ల ముందే నేలమట్టం అవుతుండటంతో బాధితులు రేవంత్ సర్కారు పై దుమ్మెత్తి పోస్తున్నారు.


కూల్చివేతలు ఆపాలని, వద్దని వేడుకుంటున్నారు. ఇదే సమయంలో బాధితులంతా బీఆర్ఎస్ తలుపులు తట్టడం ఆ పార్టికి మరింత కలిసి వచ్చింది. దాంతో అందివచ్చిన అవకాశాన్ని అవసరం మేరకు వాడుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది.


ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే అక్కడ 40 ఏళ్ల సీనియర్ నాయకుడు చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. జగన్ కూడా మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన పాలనలో ఎక్కడా కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పాలనను నడిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో గాడి తప్పిందన్న పాలనను సరిచేసే పనిలో పడ్డారు. గతంతో తరిలిపోయిన కంపెనీలు, పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ లు ఒకేసారి ఓడిపోయారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కు వచ్చిన మైలేజ్ ఏపీలో వైసీపీకి దొరకడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: