ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒకేసారి రెండు సమస్యలు వచ్చాయి. అది కూడా.. కీలకమైన ఎన్నికల సమయంలో కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెనడా దూకుడు, పొరుగున ఉన్న మిత్ర దేశం  బంగ్లాదేశ్ ఆదేశాలు. ఈ రెండు విషయాలు కూడా ఇప్పుడే తెరమీదికి వచ్చాయి.


పైగా.. ఈ రెండు అంశాలకు కూడా భారత మిత్ర దేశాలుగా ఉన్న అమెరికా, మెక్సికో సహా మరికొన్ని దేశాలు మద్దతిస్తున్నాయి. కెనడాలో జరిగిన ఖలీస్తానీ తీవ్ర వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ దారుణ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని ముఖ్యంగా ప్రస్తుతం హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలతోనే ఆయన్ను కెనడాలో హత్య చేశారని.. దీనిని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ రాయ్ పర్యవేక్షించాల్సిన కెనడా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. అయితే దీనిని భారత్ ఖండిస్తోంది.


కెనడా ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకమని శత్రువులతో చేతుల కలిపి ఇప్పుడు భారత్ ని ఏదో చేయాలని చూస్తోందని విదేశాంగ శాఖ చెబుతుండటం గమనార్హం. అమెరికా,, స్విట్జర్లాండ్, మెక్సికో, బ్రిటన్ సహా అన్ని దేశాలు ఇప్పుడు కెనడా కు మద్దతుగా నిలిచాయి. భారత్ పెద్ద దేశం.. పెద్దన్నగా సహకరిస్తే..పోయేదేమీ లేదు.. అన్ని సూత్రీకరిస్తున్నాయి.


ఇది మోదీ సర్కారు కు ఇబ్బందికరంగా మారింది. కీలక సమయంలో ఆయా దేశాలు భారత్ కు వ్యతిరేకంగా స్వరంగా వినిపించడాన్ని సహించలేకపోతున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఆగస్టులో బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న అల్లర్ల  కారణంగా ఆ దేశ అప్పటి ప్రధాని షేక్ హసీనా.. పారిపోయి వచ్చి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆమెను విచారించాల్సింది ఉందని.. ఆమెని తప్పక అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతోంది. కానీ భారత్ స్పందించడం లేదు. అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని బంగ్లాదేశ్ భారత్ కు పంపింది. తమకు తక్షణం హసీనాను అప్పగించాలని షరతు విధించింది. ఇది కూడా మోదీ కి సెగ పెడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: