దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.  సుమారు 26 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించింది.  వరుసగా మూడుసార్లు హస్తిన ప్రజలను పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించింది.  మరోవైపు 2015, 2020ల మాదిరిగానే ఏసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరవకుండానే ఎన్నికలను ముగించింది.  


ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్ లో రాహుల్ గాంధీని అభినందించారు.  బీజేపీ విజయానికి రాహుల్ సహకరించారు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.  భారతదేశంలో మోడీకి అత్యంత నమ్మకస్తుడైన కార్యకర్త ఎవరైనా ఉంటే.. అది రాహుల్ గాంధీనే అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోతో పాటు "మరోసారి బీజేపీ విజయాన్ని నిర్ధారించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు" అని రాసుకొచ్చారు.


ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ లపై ఉమ్మడిగా సెటైర్లు వేస్తూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.  ప్రియమైన కేటీఆర్ అంటు స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తాము కాంగ్రెస్ పార్టీ యోధులం అని.. ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని.. తెలంగాణలో మాదిరిగానే తిరిగి పుంజుకుంటామని అన్నారు.  ఇదే సమయంలో... "పార్లమెంట్ ఎన్నికల్లో మీ సొంత పార్టీని సున్నా సీట్లు అందించి, తెలంగాణలో బీజేపీకి మాత్రం 8 ఎంపీ సీట్లు బహుమతిగా ఇవ్వడం వంటి అద్భుతమైన విజయానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము.. ఈ సందర్భంగా... రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల క్రెడిట్ కు ఎవరైనా అర్హుడు ఉంటే.. అది మీరే.. కంగ్రాట్స్" అని కౌంటర్ వేశారు.


అరవింద్ కేజ్రీవాల్, బీఆరెస్స్ చీఫ్ కేసీఆర్ ను కలవడం వల్లే ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేశారు. గతంలో సీఎం లుగా ఉన్నప్పుడు కేసీఆర్ ను కలిసిన నేతలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాజీలుగా మారిపోయారంటూ పలు ఫోటోలు పోస్ట్ చేశారు. "మనం చెయ్యి కలిపితే మామూలుగా ఉండదుగా.. ఏపీలో వైఎస్ జగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, మహారాష్ట్రలో థాక్రే, ఢిల్లీలో కేజ్రీవాల్" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: