
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పరువు తీసేసింది. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం.. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం.. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అంటూ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను పట్టించుకొనే దిక్కు లేదని వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో మహానేత ysr సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొందన్న వైఎస్ షర్మిలా రెడ్డి.. పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన రైతులు.. నేడు గిట్టుబాటు లేక అల్లాడుతున్నారు. మిర్చి రైతు విలవిలాడుతుంటే.. కంది రైతు కంట కన్నీరు పెడుతున్నారు. కూరగాయల ధరలకు మార్కెట్ లో రెక్కలొస్తున్నా.. రైతుకు పెట్టుబడి మందం మాత్రం అందక పండిన పంటకు నిప్పు పెట్టుకొనే దీనస్థితి వచ్చిందని వైఎస్ షర్మిలా రెడ్డి అంటున్నారు.
ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయిన్న వైఎస్ షర్మిలా రెడ్డి.. చంద్రబాబు గారు మొదటి 5 ఏళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మాట తప్పితే.. జగన్ గారు ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని.. ఇద్దరు కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారని వైఎస్ షర్మిలా రెడ్డి అంటున్నారు. ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారు తప్పిస్తే రూపాయి ఇచ్చింది లేదన్న వైఎస్ షర్మిలా రెడ్డి.. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యానికి బస్తాకు రూ.1400 మించి ధర అందలేదన్నారు.
పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయిందని.. మిర్చి అయితే రూ.23 వేలు అందాల్సిన చోట రూ.11 వేల కంటే ఎక్కువ ధర దక్కలేదని... కంది రూ.10 వేల నుంచి రూ.7 వేలకు మార్కెట్ ధర తగ్గిందని చెబుతున్నారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధరల స్థిరీకరణ నిధిని తక్షణం ఏర్పాటు చేయండి. ఏడాదికి రూ.5 వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం కేటాయించండి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని షర్మిల సలహా ఇచ్చారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన రూ.20 వేల సహాయాన్ని వెంటనే .. రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిలారెడ్డి అంటున్నారు.