బండి సంజయ్.. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దయ్యా అని అంటున్నారు తెలంగాణ  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారని.. బీసీ లలో మైనార్టీలను కలిపారు అని చెప్పడం సరికాదు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అంటున్నారు. సాధారణ వ్యక్తి...చదువుకోని వ్యక్తి మాట్లాడితే... వదిలేయొచ్చు కానీ కేంద్ర మంత్రులు మాట్లాడి...చిచ్చు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు.

 
కిషన్ రెడ్డి... బండి సంజయ్ లకు పోస్టు లో వివరాలు పంపిస్తున్నానని.. హంటర్ కమిషన్ ..1882 లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.. 1918 లో మిల్లర్ కమిషన్ .. స్టడీ చేసింది..  1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి.. ఇప్పటికీ వెనకబడిన మైనార్టీలను bc జాబితాలోనే ఉన్నాయి.. బార్బర్.. వాషర్ మెన్... లాంటి వాళ్ళు వృతి సమానం.. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు.

 
గుజరాత్ లో కూడా obc ముస్లిం లు ఉన్నారన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. ఎక్కడా లేదు..తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. కమిషన్ ల నివేదిక పంపుతున్న.. కేంద్ర మంత్రులే కదా....బీసీ ల జాబితాలో ఉన్న ముస్లిం లను తొలగించి.. గుజరాత్ లో కూడా తొలగించాలని సూచించారు. మీ మోడీ రాష్ట్రం లో కిషన్ రెడ్డి...బండి సంజయ్ లకు కమిషన్ ల రిపోర్ట్ పోస్ట్ లో పంపుతా.. మతంలో కూడా పేదరికం లేదా..? .. మీరు పిలిస్తే.....మీ పార్టీ కార్యాలయానికి  వచ్చి కూడా ప్రజెంటేషన్ ఇస్తా.. కానీ మ‌తాల మధ్య చిచ్చు పెట్టొద్దని అన్నారు.


మనం అంతా భారతీయులం.. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా...వెనకబడిన తరగతులే.. బీసీల మీద అంత ప్రేమ ఉంటే... బీసీ కుల గణన చేయించు..  అప్పుడు బండి సంజయ్ శభాష్ అని అభినందిస్తా.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అంటూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: