రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంతా అనుకున్నట్టు జరగాలని రూలేమీ ఉండదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు .. చేసిన కామెంట్లు అన్నీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతాయని చెప్పలేం. ఈ విషయమై ఇప్పుడు వైఎస్సార్‌ కుటుంబంలో ఆడపడుచుల మధ్య వివాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. తన తండ్రి మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యపై డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో జరిగిన ఈ దారుణ హత్యపై సునీత కుటుంబం న్యాయపోరాటం చేస్తుంది. సొంత కుటుంబం లోని అన్న‌ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో నిజాలు వెలుగు చూస్తాయని దోషులను గుర్తిస్తారని ఆమె ఆశలు పెట్టుకున్న అది జరగలేదు. 2024 ఎన్నికల సమయంలో సునీత వైఎస్ కుటుంబంలోని మరో ఆడపడుచు జగన్ సొంత సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఇవి ఆయుధాలుగా మారాయి. వివేక హత్యతో పాటు జగన్ సదరును నిందితులను కాపాడుతున్నారంటూ అక్క చెల్లెలు ఇద్దరు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఏది ఏమైనా వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచింది.


వివేక దారుణ ఘటనలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని ఇప్పటికీ అరెస్టు చేయించలేకపోతున్నారు. సదరు కేసు విషయంలో ప్రభుత్వాన్ని కూడా ముందుకు నడిపించే విషయంలో విఫలమవుతున్నారు. కారణాలు ఏమైనా సునీతలో అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు హోం మంత్రి అనితను క‌లుసుకున్న‌ సునీత కేసు విచారణ వేగం చేయాలని అభ్యర్థించారు .. అయినా కేసు ముందుకు సాగటం లేదు. ఈ విషయంలో షర్మిల సైలెంట్ అయ్యారు. ఎనిమిది నెలలుగా వివేక పేరు కూడా ప్రస్తావించడం లేదు. జగన్ పై తరచుగా విమర్శలు చేస్తున్న షర్మిల వివేక కేసు పై నోరు ఎత్తటం లేదు. ఈ నేపథ్యంలోనే సునీత - షర్మిల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఇద్దరి మధ్య మెసేజ్లు వార్ జరుగుతుందని కడపలో ప్రచారం జరుగుతుంది. ఇలా చేశావు ఏంటి అని షర్మిలను సునీత ప్రశ్నిస్తోందని .. ఈ విషయం షర్మిల మౌనం వహిస్తున్నారని ఇద్దరి మధ్య ప్ర‌చ్ఛ‌న్న‌ యుద్ధం మొదలైందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: