కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఇంకా  ఆ పార్టీ నేతలు ఇచ్చిన  హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.  గ్రూప్ 2 మెయిన్స్ లో రాష్ట్ర విధానం మార్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది.  కూటమి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనబాట పడుతున్నారు.


అధికారంలోకి వచ్చిన మరుక్షణం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  ఆ హామీకి తగ్గట్టుగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా డీఎస్సీ ఫైల్ పైనే సంతకం చేశారు.  కానీ ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.  గత వైసీపీ ప్రభుత్వం 6000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది.  కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. అయితే ఆ 6000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు.. మరో 10 వేల పోస్టులు జత కలిపి.. 16,400 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన అయ్యింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు.


ఇక గ్రూప్ 2 మెయిన్స్  పరీక్ష సమీపించింది. కానీ రోస్టర్ విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు ఆందోళన చెందుతున్నారు. విధానాన్ని మార్చిన తర్వాతనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో నిరుద్యోగ యువత ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. జగన్ సర్కార్ చేసిన తప్పిదమే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.  రాష్ట్రవ్యాప్తంగా 92,000 మందికి పైగా నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారని..రోస్టర్ విధానం కారణంగా వారంతా ఆందోళన చెందుతున్నారని.. ఏపీపీఎస్సీ అధికారులు స్పందించకుంటే ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.


ఈ న్యాయపరమైన సమస్యలపై అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తైన తర్వాతే మొయిన్స్ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు ఈ సమస్యపై విద్యా శాక మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తమ లీగల్ టీంతో చర్చించి త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: