చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక వైర‌స్ క‌రోనా.. ప్ర‌పంచ‌దేశాల్లోనూ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతోంది. క‌రోనా ధాటికి త‌ట్టుకోలేని ప‌లు కంపెనీలు బోర్డులు ఎత్తేస్తున్నాయి. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో ఏకంగా 3803 ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ బీ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది ఎయిమ్స్‌.

న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్‌లో ఈ ఖాళీలున్నాయి. ఏపీ‌లోని మంగళగిరిలో గల ఎయిమ్స్‌లో 140 ఖాళీలున్నాయి. తెలంగాణ‌లో మాత్రం పోస్టులు లేవు. ఇక పోస్టుల పూర్తి వివ‌రాలు చూస్తే.. మొత్తం 3803 పోస్టులు ఉండ‌గా అందులో ఎయిమ్స్ న్యూఢిల్లీ- 597, ఎయిమ్స్ బఠిండా- 600, ఎయిమ్స్ డియోగఢ్- 150, ఎయిమ్స్ రిషికేష్- 300, ఎయిమ్స్ మంగళగిరి- 140, ఎయిమ్స్ గోరఖ్‌పూర్- 100, ఎయిమ్స్ జోధ్‌పూర్- 176, ఎయిమ్స్ కళ్యాణి- 600, ఎయిమ్స్ నాగ్‌పూర్- 100, ఎయిమ్స్ పాట్నా- 200, ఎయిమ్స్ రాయ్‌పూర్- 246, ఎయిమ్స్ రాయ్ బరేలీ- 594 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే..  బీఎస్సీ నర్సింగ్ / బీఎస్సీ నర్సింగ్ / బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) / పోస్ట్ బేసిక్ బీఎస్సీ / డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ ఉండాలి. అలాగే 50 పడకల ఆస్పత్రిలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉంటే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లంటే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500 ఫీజు చ‌ల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200 చ‌ల్లించాలి. దివ్యాంగులకు మాత్రం ఎలాంటి ఫీజు చ‌ల్లించాల్సిన ప‌నిలేదు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 2020 ఆగస్ట్ 18 చివ‌రి తేదీగా నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబధించిన పూర్తి వివరాలను https://www.aiimsexams.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.
 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: