కరోనా కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. దాదాపు ఏడాది వరకు అన్నీ పరీక్షల తో పాటుగా తరగతులు కూడా వాయిదా పడ్డాయి. ఇటీవల కొద్దిగా కేసులు తగ్గడంతో తిరిగి మళ్లీ స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు వరుస గా తరగతులు నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఆన్ లైన్ క్లాసులకు కూడా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అన్ని క్లాసుల విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ టీచర్లు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రమోషన్ సిస్టమ్ ఉండటంతో ఇబ్బందులేమీ రాలేదు కానీ, పదో తరగతి విషయంలోనే విద్యాశాఖ తీవ్ర ఒత్తిడికి లోనయింది.



చివరకు గతేడాది పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోషన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రమోషన్ సిస్టమ్ ఉండటంతో ఇబ్బందులేమీ రాలేదు కానీ, పదో తరగతి విషయంలోనే విద్యాశాఖ తీవ్ర ఒత్తిడికి లోనయింది. చివరకు గతేడాది పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోషన్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహణ విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.11 పేపర్లకు బదులుగా 7 పేపర్లుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, సోషల్ పేపర్లను 100 మార్కులకు ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను చెరో 50 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు..


తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. పరీక్షల్లో మరో కీలక మార్పునకు సంబంధించిన వివరాలను విద్యా శాఖ మండలి అధికారులు తెలిపారు. వంద మార్కుల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించి మరో 20 మార్కులను ఇంటర్నల్ పరీక్షల నుంచి తీసుకుని కలిపేవారు. ఇప్పుడు ఈ ఏడాదికి ఆ విధానాన్ని రద్దు చేశారు. పూర్తిగా 100 మార్కులకు పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ విషయం పై పలు చర్చలు జరిపి ఏపి విద్యా శాఖ మండలి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మార్కువి 12 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, రెండు మార్కుల అతి స్వల్ప ప్రశ్నలు 8, నాలుగు మార్కుల స్వల్ప సమాధాన ప్రశ్నలు 8, ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5 ఉండనున్నాయి. అంతేకాదు రెండు గంటలలోపే ఈ పరీక్షలను రాయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: