డిగ్రీ పాసైన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియా గవర్నమెంట్ కు చెందిన జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 44 పోస్ట్లు ఉన్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది.ఫైనాన్స్, జనరల్, లీగల్, ఇన్స్యూరెన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 29 చివరి తేదీ.


ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.gicofindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేరే వేరే విద్యార్హతలు ఉన్నాయి.. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చదివి  అప్లై చేసుకోవచ్చు.


మొత్తం ఖాళీల వివరాలు..

మొత్తం ఖాళీలు- 44
ఫైనాన్స్- 15
జనరల్- 15
లీగల్- 4
ఇన్స్యూరెన్స్- 10

దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 29
దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2021 మార్చి 11 నుంచి మార్చి 29
ఆన్‌లైన్ ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సెషన్- 2021 ఏప్రిల్ 26 నుంచి 29
అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 10 రోజుల ముందు
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 మే 9
ఫలితాల వెల్లడి- తేదీని త్వరలో వెల్లడించనున్న జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్


విద్యార్హతలు- సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.

 విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వయస్సు- 2021 ఫిబ్రవరి 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.


ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సెషన్- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో 2021 ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది.


ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్


వేతనం- రూ.32,795 బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులు ఉంటాయి. మొత్తం రూ.65,000 వేతనం లభిస్తుంది.

ఎక్జామ్ సెంటర్స్: ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి,

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్

మరింత సమాచారం తెలుసుకోండి: