
గత కొన్ని రోజులుగా పసిడి ప్రియులకు షాకులు ఇస్తూ గగనానికి ఎగబాకిన బంగారం ధర.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. గత మూడు రోజులుగా పసిడి ధర తగ్గుతూనే వస్తోంది. వివిధ శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్లో బంగారం ధర దిగిరావడం గమనార్హం. బంగారం వెలవెలబోతే.. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.920 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,310కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.
10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గుదలతో రూ.48,090కు దిగొచ్చింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.74 శాతం పైకి ఎగసింది. దీంతో ధర ఔన్స్కు 1734.70 డాలర్లకు చేరుకుంది. బంగారంతో పాటే వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్కు 1.88 శాతం పెరగడంతో 17.69 డాలర్లకు చేరుకుంది. ఇకపోతే బంగారం ధరపై చాలా అంశాలు ఎఫెక్ట్ చూపిస్తాయి. గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.46,000 వద్దనే ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. దీంతో ధర రూ.47,810 వద్ద స్థిరంగా ఉంది. ఇక కేజీ వెండి ధర పడిపోయింది. రూ.800 తగ్గుదలతో రూ.47,900కు పతనమైంది.