దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. గత ఐదు రోజులుగా ధరలు ఇలానే పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 పెరగడంతో ధర రూ.53,330కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.48,900 కి చేరింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ ధర స్వల్పంగా పెరుగుతోంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు.


విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,330, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,900కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,520కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,520 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,540, 22 క్యారెట్ల ధర రూ.48,170కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,720. 24 క్యారెట్ల ధర రూ.50,980 గా ఉంది.


దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా పెరగడంతో వెండి కూడా అదే బాట పట్టింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.10 పెరగడంతో ధర రూ.67,220కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,130కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49.620కు చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్వల్పంగా ఉంది. కేజీ వెండి ధర రూ.10 పెరగడంతో ధర రూ.67,220కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: