
హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు రేట్లు చూస్తే..హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.51,930కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,610కు ఎగసింది.నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా పైకి కదిలింది. అంటే పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
పసిడి రేట్ల పై నే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి..గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర నేడు ఇంకాస్త పెరిగింది. వెండి కిలో ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వస్తువుల, తయారీ, నాణేల తయారీ మొదలగు వెండి వస్తువులు డిమాండ్ పెరగడంతో వెండి ధరలు ఊపందుకుంటున్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో వీటి ధర విషయానికొస్తే..బంగారం ధర ఔన్స్కు 0.24 శాతం తగ్గుదలతో 1942 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.44 క్షీణతతో పెరుగుదలతో 25.07 డాలర్లకు దిగొచ్చింది.